IMF: భారత్ ఆర్థిక పెరుగుదల.. చైనా, అమెరికా పరిస్థితి ఎలా? 10 d ago

featured-image

2015లో 2.1 ట్రిలియన్ డాలర్లుగా ఉన్న భారతదేశ స్థూలజాతీయోత్పత్తి(జీడీపీ) 2025నాటికి 4.3 ట్రలియన్ల డాలర్లకు చేరింది. గత పదేళ్లలో ఇండియా జీడీపీ 105శాతం వృద్ధి చెందిందని ఐఎమ్ఎఫ్ పేర్కొంది. అంతర్జాతయ ద్రవ్యనిధి (ఐఎమ్ఎఫ్) ప్రకారం, దశాబ్దకాలంలో భారత్ 77 శాతం వృద్ధిని నమోదు చేసింది. 2015లో 2.4 ట్రిలియన్ల డాలర్ల నుంచి 2025లో 4.3 ట్రిలియన్ల డాలర్లకు పెరిగింది. ఈ వేగవంతమైన వృద్ధి భారత్ ను ప్రపంచంలోని మొదటి ఐదు ఆర్థిక వ్యవస్థల్లో చేర్చింది. 2025లో జపాన్ను అధిగమించి, 2027 నాటికి జర్మనీని అధిగమించే అవకాశం ఉంది. మిగతా దేశాల అభివృద్ధిని కూడా ఐఎమ్ఎప్ విడుదల చేసింది. చైనా పదేళ్లలో 74 శాతం జీడీపీ వృద్ధిని సాధించింది.

2015లో 11.2 ట్రిలియన్ల డాలర్ల నుంచి 2025లో 19.5 ట్రిలియన్ల డాలర్లకు పెరిగింది. కోవిడ్ మహమ్మారి, కొనసాగుతున్న ఆర్థిక సవాళ్ల నుంచి ఎదురు దెబ్బలతో చైనా అమెరికాను అధిగమించలేకపోయింది. ఇక అమెరికా ప్రపంచలోనే ఆర్థిక వ్యవస్థగా నిలిచింది. 2015లో అమెరికా జీడీపీ 23.7 ట్రిలియన్ల డాలర్లు ఉండగా.. 2025లో 30.3 ట్రిలియన్ల డాలర్లకు చేరింది. ఇది పదేళ్లలో 28శాతం వృద్ధి రేటును సూచిస్తుంది. ఇది ఆసియా దేశాల ఆర్థిక వ్యవస్థల కంటే నెమ్మదిగా వృద్ధిరేటు ఉన్నప్పటికీ ప్రపంచ ఆర్థిక స్థిరత్వంలో అమెరికా ఇప్పటికీ ఆధిపత్యం చెలాయిస్తూనే ఉంది.

UK, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్ వంటి ఇతర ప్రధాన ఆర్థిక వ్యవస్థలు పదేళ్లలో 6శాతం నుంచి 14 శాతం వరకు జీడీపీ వృద్ధిని సాధించాయి. ఈ ఆదేశాల ఆర్థిక వ్యవస్థలు నెమ్మదిగా విస్తరణ జరిగినప్పటికీ ప్రపంచ వాణిజ్యం, ఆర్థిక రంగంలో గణనీయమైన ప్రభావాన్ని చూపుతూనే ఉన్నాయి. టాప్ టెన్ ఆర్థిక వ్యవస్థల(అమెరికా, చైనా, జర్మనీ, జపాన్, భారతదేశం, యూకే, ఫ్రాన్స్, ఇటలీ, కెనడా మరియు బ్రెజిల్) లో బ్రెజిల్ అత్యల్ప GDP వృద్ధిని నమోదు చేసింది. 2015లో 21 ట్రిలియన్ల డాలర్లు ఉన్న జీడీపీ 2025లో 2.3 ట్రిలియన్ల డాలర్లకు చేరింది. ఇది కేవలం 8 శాతం పెరుగుదల మాత్రమే నమోదు చేసింది.

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD